మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట మట రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకకు ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్షవడ్ల వెంకన్న హాజరై వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు మాట్లాడుతూ 2004 సంవత్సరం లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది అని అన్నారు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో వైయస్సార్ సీఎం అయిన మొదటి వారంలోనే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అనాధలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారని అన్నారు.పావలా వడ్డీకే రైతులకు పంట రుణాలు అందించిన ఘనత వైయస్సార్ దే అని కొనియాడారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్ దేనని అన్నారు.పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ, మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ 108 అంబులెన్స్ సౌకర్యం కల్పించిన మహానీయుడని,గొప్ప పరిపాలన అందించినారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఖలీల్ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ బాలరాజు, మాజీ ఎంపిటిసి లు వావిలాల నరసింహారావు,పెద్ద బోయిన నరసింహారావు,ముక్కెర లాలయ్య,ఎండి సులేమాన్ బాబా,ఎండి రియాజ్, వావిలాల సాంబశివరావు, చిక్కుల మానస, ప డిదల హనుమంతు,తాళ్లపల్లి నరేందర్,గడ్డం మహేష్,సాధన పల్లి లక్ష్మయ్య,యాకూబ్ పాషా,గద్దల నవీన్,చామర్తి మనోజ్, కర్నే సత్యం, ఎండీ గౌస్,విద్యాసాగర్,శ్రీరాములు, మహేష్,కట్కూరి రాధిక,వలస తిరుపతి,మహేష్, ఆదినారాయణ,మహేష్ సమ్మయ్య,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: