మన్యం టీవీ ఏటూరు నాగారం
ఎన్నో ఏళ్లుగా క్రితం గుండెకు రంద్రం పడి దిన దిన గండంగా ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని బ్రతుకుతున్న వెంకటాపురం మండలం మహితాపురం గ్రామానికి చెందిన చెరుకుల మంజులకు గుండె ఆపేరేషన్ కొరకు గత కొన్ని రోజులుగా దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. గురువారం టీఎస్ఏటిఎఫ్ నాయకులు కోరం సంతోష్, పూనెం రమేష్ బాధితురాలు హాస్పిటల్లో ఉండటంతో తెలుసుకొని వెంకటాపురం ఎంపీపీ చెరుకుల సతీష్ కుమార్ చేతుల మీదగా స్థానిక సర్పంచ్ కొర్శా నరసింహమూర్తికి 9 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగింది.మంజుల పరిస్థితి విషమించడంతో గురువారం ఆపేరేషన్ కి హాస్పిటల్ కు బయలుదేరి వెళ్లిపోవడంతో ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ వారు సర్పంచ్ నరసింహమూర్తికి నగదు ఇచ్చి మంజుల బ్యాంక్ ఖాతాలో జమ చేయమని సూచించారు. ఎంపీపీ చెరుకుల సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ వారు బాధితురాలు మంజులకు ఆర్ధిక సహాయాన్ని అందించడం అభినంద నీయం అన్నారు. టీఎస్ఏటిఎఫ్ ఆదివాసీ విద్యార్థులకు విద్యా బోధన తో పాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం శుభపరిణామం అన్నారు.కరోనా సమయంలో కూడా కరోనా బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని టీఎస్ ఏటిఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కోరం సంతోష్ అన్నారు.ఆపదలో ఉన్న ఆదివాసీల కు సహాయాన్ని అందించడానికి టీఎస్ఏటిఎఫ్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని ఆయన తెలియజేశారు.ఆపదలో ఉన్న ఆదివాసీ మహిళకు వివిధ శాఖల్లో పని చేస్తున్న ఆదివాసీ ఉద్యోగులు తమ ఆర్ధిక సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎస్ఏటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్యామల ఆంజనేయులు,మండల అధ్యక్షులు పూనేం రమేష్ మహితాపురం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: