CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడుభూముల రక్షణకు పోరాటాలే మార్గం. ND నేత మోర రవి

Share it:



మన్యం మనుగడ, పినపాక:

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, హరితహారం  పేరుతో పేదలు, ఆదివాసీల భూములను ఫారెస్ట్ వారు అక్రమంగా ఆక్రమించుకొని మొక్కలునాటడం నిలుపుదల చేయాలని, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి డిమాండ్ చేశారు. ఈనెల 9వ తేదీన ఇల్లందు మండలం  కొమరారం నుండి పోడు భూముల రక్షణకై జరుగు పాదయాత్రను, ఈనెల 11న చలో కొత్తగూడెం కలక్టరేట్ ను విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పినపాక మండలం వుప్పాక గ్రామంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి పంచారు ఈ ప్రచార కార్య క్రమంలో మోర రవి  ప్రసంగిస్తూ...కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టాల రద్దుకై దేశ రాజధాని లో పోరాడుతున్నా రైతులకు అభినందనలు తెలిపారు. అలాగే పోడుభూములను అక్రమంగా  ఆక్రమించుకోవాడాన్ని నిలిపివేయాలని, ఇప్పటివరకు ఆక్రమించిన పోడుభూమిని ఎవరి భూములు వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. పోడుభూముల రక్షణకై .  ఈనెల 9న కొమరారం నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందని, ఈనెల 11వ తేదీకి పాదయాత్ర కొత్తగూడెం చేరుతుందని తెలిపారు 11న కొత్తగూడెం చలో కలెక్టరేటుకు ప్రతి ఆదివాసీ, గిరిజన, పేద రైతులు వ్యక్తిగత దరకాస్తుతో హాజరై మన సమస్యల పరిస్కారానికి కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలి సంఘం నాయకులు గద్దల శంకర్ , సాధు శ్రీను, గద్దల వెంకటేశ్వర్లు, గద్దల సాంబయ్య,నరసమ్మ, అంజమ్మ, స్వరూప , లక్ష్మి , మౌనిక తదితరులు  స్థానికులు  పాల్గొన్నారు. 

              మోర రవి

            . కార్యదర్శి                                             సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

మణుగూరు సబ్ డివిజన్ కమిటీ

Share it:

TELANGANA

Post A Comment: