అశ్వరావుపేట ఎ డి ఎ అబ్దుల్ బేగం : చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ఫెర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్స్ దుకాణదారులకు ప్రభుత్వ నియమ నిబంధనలు తుచ తప్పకుండా పాటించాలని అశ్వరావుపేట ఎ డి ఎ అబ్దుల్ బేగం అన్నారు. గురువారం చండ్రుగొండ పలు దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి దుకాణంలో స్టాక్ రిజిస్టర్లు మెయింటెన్ చేయాలని,నిల్వ బోర్డులు తప్పకుండా పాటించాలన్నారు. ధరల పట్టికలు ప్రతిరోజూ చూపించాలన్నారు. రైతులు ప్రతి కొనుగోలుపై రసీదు ఇవ్వాల్సిన బాధ్యత షాపు యజమానులదే అన్నారు. తనిఖీ సమయంలో లైసెన్స్ డీలర్లు సహకరించాలన్నారు.అధిక ధరలకు ఎరువులు, మందులు మరియు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ తనిఖీలో ఇన్చార్జి ఏవో అనూష,ఏ ఈ ఓ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: