మన్యం మనుగడ, పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జగ్గారం పంచాయతీని ఇటీవల పినపాక మండల ఎంపిఓ గా బాధ్యతలు చేపట్టిన గాంధీ పర్యటించారు. గత కొన్ని రోజులుగా డెంగ్యూవ్యాధి కారణంగా మరణాలు జరిగాయని తెలుసుకున్న ఆయన గురువారంనాడు పంచాయతీ లో పర్యటించారు. పంచాయతీ సర్పంచ్ గుమ్మడి అనంత, సెక్రటరీ అరుణ్ కుమార్ లతో గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటించి, ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. జ్వరంతో బాధపడుతున్న బాధితులకు రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సంధ్య, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: