ఘనంగా తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
మన్యం టివి:ములకలపల్లి మండలం: తెలంగాణ జాతిపిత,సిద్ధాంతకర్త స్వరాష్ట్ర స్థాపన కొరకు ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నెఅంకితం చేసిన మహనీయులు ఆచార్య జయశంకర్,తెలంగాణ ప్రజల హృదయాల్లో సదా చిరస్మరణీయుడు సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ స్వరాష్ట్రం ఆకాంక్షించిన జయశంకర్,తాను కలలు కన్న బంగారు తెలంగాణ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని,రాష్ట్రాన్ని సాధించిన ఏడేళ్ల అనతికాలంలోనే సాగునీరు,వ్యవసాయం,పరిశ్రమలు తదితర రంగాల్లో పురోగతిని సాదించిందని,రాష్ట్రం ఏర్పడటానికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటు అంతటి గొప్ప మహానుభావుడు ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో టిఅర్ఎస్ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు, ప్రధాన కార్యదర్శి శెనగ పాటి రవి,ఎంపీపీ మట్లనాగమణి,సర్పంచ్ లు సున్నం సుధాకర్ ,కీసరి శ్రీనివాస్,ఉప సర్పంచ్ శెనగపాటి అంజి,నాయకులు పర్వతినేని అమర్నాథ్ ,శనగ పాటి సీతారాములు, యలమంచిలి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: