CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విషజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Share it:

 


👉జ్వరాల బారిన పడిన వెంటనే స్థానిక ఏఎన్ఎం ,ఆశలకు తెలియజేయాలి

👉 అధిక యాంటీబయాటిక్స్, నొప్పుల మాత్రలతో ప్రాణాలకే ప్రమాదం

👉పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రసాద్

మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని తోగ్గూడెం పంచాయతీలో సోమవారం నాడు ఆరోగ్య సర్వే నిర్వహించారు. ఈ కార్య క్రమంలో అనారోగ్య లక్షణాలు కలిగిన వారిని గుర్తించి మలేరియా,టైఫాయిడ్ ఇతర పరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది 

ప్రతి ఒక్కరు సీజనల్ వ్యాధులు ముఖ్యంగా డెంగీ, మలేరియా మరియు కరోనా వ్యాధులు విజృంభిస్తున్న సందర్భంగా అవగాహన కలిగి ఉండాలి అని నివారణ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది 

ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రసాద్ , హెచ్ ఈ ఓ వీరస్వామి, హెల్త్ ఆస్తెంట్ ప్రవీణ్, వెంకట్, ఏఎన్ఎంలు పద్మావతి, అరుణ , ఆశాలు సరోజిని, లావణ్య, ఆదిలక్ష్మి, వరలక్ష్మి, భువనేశ్వరి బ్రీడర్ రాము తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: