CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఓసి 2 నందు ప్రమాద ఘటనలో మృత్యువాత పడిన పర్స సాగర్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందించిన టిబిజికేయస్ నాయకులు -సింగరేణి అధికారులు

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

 మణుగూరు సింగరేణి ఏరియా ఓసి 2 నందు జరిగిన ప్రమాద ఘటనలో మృత్యువాత పడిన పర్స.సాగర్ కు సింగరేణి యాజమాన్యం ఎక్స్ గ్రేషియా ను విడుదల చేయడం జరిగింది.. టిబిజికేయస్ కృషి ఫలితంగా త్వరితగతిన విడుదలైన 15 లక్షల 95 వేల రూపాయల చెక్కును పర్స సాగర్ తల్లిదండ్రులైన పర్స. రాయలింగు-లక్ష్మీ వారి స్వగృహం కు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపి టిబిజికేయస్ బ్రాంచి నాయకులు వీర భద్రయ్య , కోట శ్రీనివాసరావు , ఓసి 2 వెల్ఫేర్ ఆఫీసర్ మదర్ సాహెబ్ చెక్కును వారికి అందించడం జరిగింది.బాష్యా కుటుంబ సభ్యులకు రేపు ఉదయం కొత్తగూడెం వెళ్లి వారి స్వగృహంలో వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్కును అందించనున్నట్టు వారు తెలిపారు..ప్రమాద ఘటన జరిగి వారం రోజులు నిండక మునుపే త్వరితగతిన మృతుల కుటుంబాలకు అండగా నిలిచి వారికి రావలసిన ఆర్థిక ప్రయోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మృత్యువాత పడిన కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తున్న మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు కి కార్మికులు, మృతుల కుటుంబాలు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు

Share it:

Post A Comment: