మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పర్యటన లో భాగంగా బుధవారం జడ్పీ చైర్మన్ ముందుగా మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం లో పూజలు నిర్వహించారు.అనంతరం గడ్డం దశరథం కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అలాగే ఏటూరు నాగారం మండల లోని రామన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు ఈట్టెం శంకర్ కుమారుడు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం మండల మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి ఆరిఫ్ తండ్రి సాదిక్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.తదనంతరం ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్,టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కునూరు మహేష్ గౌడ్ ల మేనమామ మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి,టిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వాజేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదె బోయిన బుచ్చయ్య,జడ్పి కోఆప్షన్ నెంబర్ వలియాబి,ఏటూరు నాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ పాషా, రామన్నగూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ,ఎండి ఖాజా పాషా, కోమిరి రమేష్,కుమ్మరి చంద్రబాబు,జాడి బోజరావు, వావిలాల రాంబాబు,కొండాయి చిన్ని,చిప్ప అశోక్,కందకట్ల శ్రీనివాస్,పొలం శ్రావణ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: