👉సి.పి. యం . డిమాం డ్ : మన్యం టీవి,బూర్గంపాడు: మండలంలోని వివిధ గ్రామాల్లో వర్షాకాలం కారణంగా వచ్చే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాల బారిన పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు .గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. మంగళవారం నాడు సిపిఎం బృందం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విషజ్వరాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయని ఈ తరుణంలో వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటు లో ఉండాలని సూచించారు. మండలంలోని ప్రభుత్వ హాస్పటల్లో సిబ్బంది కొరత ఉన్నదని ఉన్న సిబ్బందితో ఆరకొరగా విధులు నిర్వహిస్తున్నారని వైద్యులు విధులకు గైరహాజరు అవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక పోవడంవలన ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని , సరైన వైద్యం అందక డెంగ్యూ తో మరణించిన సంఘటన కూడా మండలంలో నెలకొన్నదని అన్నారు. జిల్లా ఉన్నత అధికారులు వెంటనే స్పందించి విషజ్వరాల బారిన పడిన వారికి సరైన వైద్యం అందిచాలని కొరతగా ఉన్న వైద్య సిబ్బందిని వెంటనే భర్తీ చెయ్యాలని విధులకు గైరహజరు అవుతున్న సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సి.పి. యం పార్టీ మండల కమీటి సభ్యులు బయ్యారాము బర్ల తిరుపతయ్య కొమర్రాజు సత్యనారాయణ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: