మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 10):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) గా ఎస్కే షబానా,మంగళవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎంపీఓ గా విజయభారతి విధులు నిర్వర్తిస్తూ, జూలై 20 వ తేదీన అకాల మృతి చెందగా, ప్రస్తుతం మండలంలో ఖాళీగా ఉన్న ఎంపిఓ స్థానంలో ఎస్కే షబానా ఇక్కడికి వచ్చారు.షబానా గతంలో పినపాక మండలంలో బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలియజేశారు.
Post A Comment: