మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 10):: అన్నపురెడ్డిపల్లి మండలం కు డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం విచ్చేశారు. మండలంలో నూతనంగా ప్రారంభం కానున్న డిసిసి బ్యాంక్ ఏర్పాటు పనులను వీక్షించి,విజయదశమి నాటికి త్వరగాతినా బ్యాంకు ఏర్పాటు పనులను పూర్తిచేయాలని అన్నారు. వారి వెంట గుంపెన పిఎసిఎస్ చైర్మన్ బోయినపల్లి సుధాకర్ రావు, అన్నపురెడ్డిపల్లి ఎంపీటీసీ కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షులు కొత్తూరు వెంకటేశ్వరరావు, ఎం రాంబాబు, పానుగంటి రాఘవులు, కట్ట శివ, చల్లా రాంబాబు, వీరబోయిన వెంకటేశ్వర్లు, వీరబోయిన అప్పారావు, తదితరులు ఉన్నారు.
Post A Comment: