మన్యం మనుగడ వెబ్ డెస్క్:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే అభివృద్ధిలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూరదృష్టి.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసిన కార్యాచరణ ఫలితంగా దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కీర్తిని గడించింది. దాదాపు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. సొంత రాబడుల్లో ఇతర రాష్ర్టాలకు అందనంత ఎత్తులో నిలిచింది. వ్యవసాయం, విద్యుత్తు, పరిశ్రమలు, ఐటీ ఇలా.. అన్ని రంగాల్లోనూ రెట్టింపు వృద్ధిని సాధించింది. గతంలో దండగ అనుకున్న వ్యవసాయం.. నేడు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇంజిన్గా మారింది. ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (ఎంవోపీఐఎస్) ఇటీవల అందుబాటులో ఉన్న 18 రాష్ర్టాలు వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై విడుదల చేసిన నివేదికల్లోనివే. దీంతోపాటు ఇతర కేంద్ర సంస్థలు, ప్రపంచ బ్యాంకు నివేదికల ఆధారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ‘తెలంగాణ ఏడేండ్ల ప్రగతి నివేదిక’ను సిద్ధంచేసింది. దీనిని ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం విడుదలచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఏడేండ్లలోనే అనూహ్య వృద్ధిని సాధించినట్టు స్వయంగా కేంద్రమే ఒప్పుకొన్నదని చెప్పారు.
Post A Comment: