మన్యం టీవీ ఏటూరు నాగారం ములుగు,భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న ఎదిర గుట్టల లో శుక్రవారం బాట సారులకు 2 పులులు కనిపించడం తో వారూ అట్టి దృశ్యాలను ఫోన్ లో చిత్రీకరించారు. అట్టి వీడియో క్లిప్పింగ్స్ కూడా పలు వాట్సాప్ గ్రూప్ లలో చెక్కర్లు కొడుతుంది.దింతో సమీప అటవీ ప్రాంతంలోని గ్రామాల ప్రజలు రైతులు ఆవులు, గేదెల,మేకల కాపరులు ఆందోళన చెందుతున్నారు. సమీప అటవీ ప్రాంతంలో కి వెళ్లడానికి ఎవరూ కూడా సాహసం చేయడం లేదు.వారికీ భయం పట్టుకుంది.అటవీ శాఖ అధికారులు పులుల కలకలం రేపుతోంది అనే విషయం పై అరా తీస్తూ పూర్తీ వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు.
Post A Comment: