మన్యం టీవీ ఏటూరు నాగారం ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగధీశన్న జన్మదినం సందర్భంగా తెరాస యూత్ జిల్లా నాయకులు పోలం శ్రావణ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ములుగు గట్టమ్మ తల్లికి పూజలునిర్వహించారు.అనంతరం గట్టమ్మ పూజారులు, భక్తులు,పర్యటకుల మధ్య కేక్ కట్ చేసారు.ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగధీషన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని,ఉన్నత పదవులు రావాలని,ములుగు జిల్లా ప్రజలకు మరింత సేవ చేసేలా ఆ గట్టమ్మ తల్లి ఆశిస్సులు ఉండాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధికార ప్రతినిధి అంతటి రాము,యూత్ నాయకులు అజ్మీర అజయ్,ఓదెల శరత్,అజార్,ఇమ్మడి రాము యాదవ్,తరుణ్,శివ,చింటు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: