మన్యం టీవీ,బూర్గంపాడు:
2020 నవంబర్ నెలలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో నిందితుడికి ఈ రోజు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ గౌరవ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి,ఖమ్మం చంద్రశేఖర ప్రసాద్ గారు తుది తీర్పును వెల్లడించారు.
2020 నవంబర్ 19న బూర్గంపాడు ఎస్సై బాలకృష్ణ Cr.no.301/2021 క్రింద పొక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రాధమిక విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
అనంతరం పాల్వంచ డిఎస్పి కె.ఆర్.కె ప్రసాద్ విచారణ చేపట్టి,కోర్టు డ్యూటీ ఆఫీసర్ చనుమోలు శ్రీనివాస్ సహాయంతో నిరంతరం పరిశీలిస్తూ ఇట్టి కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసారు.నిందితుడికి ఈ రోజు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 2000/-ల రూపాయల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు వారు తుది తీర్పును వెల్లడించారు.ఇట్టి కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన అడిషనల్ ఎస్పి కేఆర్కే ప్రసాద్ ని మరియు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ చనుమోలు శ్రీనివాస్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Post A Comment: