మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఆదివాసి గ్రామాలైన చింతలపాడు, విప్పలగుంపు లకు చెందిన 11 మంది వ్యక్తులు అడవి జంతువు కనుజు ఆదివారం రోజున హతమార్చడం జరిగింది. విచారణ చేపట్టగా ఆదివారం రోజున ఒక వ్యక్తి ఆచూకీ లభించగా, మిగిలిన పది మంది వ్యక్తులను సోమవారం రోజుఅరెస్టు చేయడం జరిగిందని ఏడూళ్ల బయ్యారం అటవీ క్షేత్ర అధికారి తేజస్వీ తెలిపారు. నిందితుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
విప్పల గుంపు కు చెందిన
1) కుంజా రమేష్- తండ్రి సోమయ్య
2)మడకం అందయ్య -తండ్రి చిన్న లింగయ్య
3)మడవి భీమయ్య -తండ్రి ఉం
4) ముచుకి నంద- తండ్రి ఉం
5) సోడే అర్జున్ -తండ్రి వెంకయ్య
6)సోడే రమేష్ -తండ్రి వెంకయ్య
7)కోరం భాస్కర్- తండ్రి పోచయ్య
చింతలపాడు కు చెందిన
8) మడవి సురేష్ -తండ్రి ఉంగయ్య
9)కొడెం గంగయ్య -తండ్రి కామయ్య
10) మడకం దేవయ్య -తండ్రి లక్ష్మయ్య
పెద్దపల్లి గ్రామానికి చెందిన
11) నూప రమేష్- తండ్రి మంగయ్య.
వీరిని "1972 వన్య మృగ సంరక్షణ చట్టం" ప్రకారం, రిమాండ్ కు తరలిస్తున్నట్లు, కనుజు మృతదేహాన్ని పినపాక మండల పశువైద్యాధికారి బాలకృష్ణ చౌహాన్ చే పోస్టుమార్టం చేయించి, మృతదేహాన్ని ఖననం చేసినట్లు అటవి క్షేత్ర అధికారి తేజస్వి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ వో సోలం అరుణ, బీట్ అధికారులు, లక్ష్మణ్, ఆదిత్య, వెంకటేశ్వర్లు, అటవి క్షేత్ర కార్యాలయ సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: