మన్యం టీవీ, అశ్వాపురం:ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించిన అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ఉద్యమ కారుడు, టీ ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల కార్యదర్శి మందడి కరుణాకర్ రెడ్డి కుటుంబానికి ఈరోజు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రూ.1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మణుగూరు జడ్పీటీసీ పొషం నర్సింహారావు, డీ సీ సీ బీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తి నేని సుజాత, రైతు బంధు సమితి అధ్యక్షుడు గజ్జల లక్ష్మారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎస్ కే.ఖదీర్, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, టీ ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, నాయకులు సూది రెడ్డి గోపాలకృష్ణారెడ్డి, కందాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: