*యునెస్కో గుర్తింపు కు 40 యేండ్ల నుండి కృషి చేసిన పాండు రంగారావు గారికి ధన్యవాదాలు.
*కవులు, కళాకారులు,పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు జిల్లా అధికార యంత్రాగం రామప్ప కళ సంపదను ప్రపంచానికి విస్తరింప చేసిన వాళ్ళ కృషి మరువలేనిది.
*రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం లో మంత్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
*మన్యం టీవీ ఏటూరు నాగారం*
ములుగు జిల్లా వెంకటా పూర్ మండలం పాలంపేట గ్రామం లోని శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి నీ మంత్రులతో కలిసి దర్శించు కున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ రామప్ప కు యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరం అని రామప్ప కళ సంపదను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నిట్ రిటైర్డు ప్రొఫెసర్ పాండురంగారావు గారి 40 యేండ్ల కృషి ఫలితమే యునెస్కో గుర్తింపు అని కాకతీయ కళ సంపదకు దక్కిన అరుదైన గౌరవం అని అదే విధంగా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు జాతీయ పండగగా గుర్తించాలని
సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జిల్లా అధికారులు తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షుడు చేన్నోజు సూర్యనారాయణ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేశ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజుసీనియర్ నాయకుడు గోపాల్,ఏల్లవులఅశోక్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ ఉపాధ్యక్షులు మామిడి శెట్టి కోటి,మేడం రమణకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: