CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది.

Share it:

 


మన్యం వెబ్ డెస్క్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో కలిపి మొత్తం రూ.8 కోట్లకు పైగా విలువైన 4,483 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో రూ.7.30 కోట్లు, ఖమ్మం గ్రామీణ పరిధిలో రూ.1.98 కోట్లు విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి పరిధిలోని విద్యానగర్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన రెండు లారీలను పోలీసులు తనిఖీ చేశారు. రెండు లారీల్లోనూ చేపల పెట్టెల్లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. రెండు లారీల్లో కలిపి మొత్తంగా 3,653 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు..

అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా చింతూరు నుంచి హైదరాబాద్‌ మీదుగా హరియాణాకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఖమ్మం సీపీ విష్ణు వారియర్‌ వెల్లడించారు. మరోవైపు ఖమ్మం గ్రామీణం పరిధిలోనూ రూ.1.98 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Share it:

Post A Comment: