CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

◆గిరిజనుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్న వైద్య బృందం◆

Share it:


"【కాలినడకన వాగులు దాటుతూ వెళ్లి,అడవిలో ఉన్న గోత్తి కోయ గిరిజన ఆవాసాలలో హెల్త్ క్యాంప్】"


మన్యం మీడియా ప్రతినిధి /అన్నపురెడ్డిపల్లి( జులై 28 ):: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి ప్రియాంక ఆధ్వర్యంలో అడవిలో నివసిస్తున్న శాంతినగర్ మైగ్రేషన్ గ్రామమైన వలస గోత్తి కోయ గిరిజన గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ వర్షాకాల సీజన్ దృష్ట్యా , వైద్య బృందం కాలినడకన వాగులు దాటుకుంటూ వెళ్లి, గోత్తి కోయ గిరిజనుల ఆవాసాలను సందర్శించి, వైద్య పరీక్షలు చేసి మందులను అందజేశారు. అనంతరం గిరిజనులు ఆరోగ్యం పట్ల పాటించవలసిన వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మరియు కరోనా జాగ్రత్తలను గురించి వారికి తెలియజేశారు.ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, లాంటి వ్యాధులు రాకుండా, ప్రభుత్వం ఇచ్చిన దోమ తెరలను వాడుకోవాలని, గ్రామంలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్-పోలెబోయిన కృష్ణయ్య, పిహెచ్ఎన్-పుల్లమ్మ, హెచ్వి-శారా రాణి, హెచ్ఏ ఏ(ఎఫ్)-జ్యోతి, శ్రీదేవి,ఆశాలు-సీత, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: