మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మిక పర్యటన లో భాగంగా పినపాక మండలం లోని పొట్లపల్లి, గడ్డంపల్లి లలోని డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం లో పెద్ద మొత్తంలో మొక్కలను పెంచాలని, మధ్య భాగంలో వదల మాదిరిగా వచ్చే చెట్లను పెంచాలని, సూచనలు చేశారు. అసంపూర్తిగా ఉన్న ప్రకృతి వనం పట్ల అసంతృప్తి వ్యక్తం పరిచి, సాధ్యమైనంత తొందరగా ప్రకృతి వనాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు. డంపింగ్ యార్డ్ లో చేపట్టిన కంపోస్ట్ ఎరువు కు సంబంధించి, తయారీ విధానం గురించి సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల ప్రత్యేక అధికారి రాంప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్, ఎంపీవో సునీల్ శర్మ, పి ఆర్ ఏఈ వెంకట్, విద్యుత్ శాఖ ఏఈ రవీందర్, పొట్లపల్లి సర్పంచ్ కళ్యాణి, గడ్డం పల్లి సర్పంచ్ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: