మన్యంటీవీ, అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు అశ్వారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం గ్రామ పంచాయతీ లో వైకుంఠ ధామం లో మొక్కలు నాటారు, అచ్యుతాపురం సర్పంచ్ ఎమ్మెల్యే మెచ్చాకి సన్మానం చేయటం జరిగింది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అదే గ్రామంలో సోనే జయమ్మ కుమారుడు ఇటీవలే కాలం చేయగా వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం పేరాయి గూడెం గ్రామ పంచాయితీలో పల్లె ప్రగతిలో భాగంగా నూతన కరెంట్ ఫోల్ ప్రారంభించారు. అశ్వారావుపేట లోని నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ది దారులకు అందజేశారు. అక్కడ నుండి అశుపాక పంచాయతీలో వైకుంఠ ధామం ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం తిరుమల కుంట గ్రామంలో వెంకన్న బాబు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మీ, మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్, సర్పంచ్లు యాట్ల నాగలక్ష్మి, నార్లాపాటి సుమతి, అట్టం రమ్య, లింగయ్య, ఎంపీటీసీలు, ఆర్డీవో స్వర్ణలత, ఎంపిడిఓ విజయ, ఏంఆర్ఓ చల్లా ప్రసాద్, తెరాస పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, మండల నాయకులు మోహన్ రెడ్డీ, రవి మరియు తెరాస పార్టి నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు ఆయా గ్రామ సెక్రటరీ లు, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: