కరకగూడెంమండల పరిధిలోని రేగళ్ళ,భట్టుపల్లి,సమాత్ భట్టుపల్లి గ్రామ పంచాయితీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి నాల్గవ కార్యక్రమం ప్రారంభం భాగంగా గురువారం గ్రామసభలో కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక పాల్గొని,గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామల్లో ఉన్నటివంటి సమస్యలు గుర్తించి పల్లె ప్రగతిలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.అనంతరం మొక్కలు పంపిణీ చేసి,గ్రామపంచాయతి ప్రాంగణంలో మొక్కలు నటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచులు కుంజ వసంతరావు,తోలెం నాగేశ్వరరావు,పోలెబోయిన శ్రీవాణి,మండల అభివృద్ధి అధికారి శ్రీను,ఎంపివో సునీల్ కుమార్,పంచాయతీ కార్యదర్శులు,వార్డ్ సభ్యులు,గ్రామస్తులు,పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: