CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ గిరిజన క్రీడాకారుడు శ్రీరామ్ సన్మాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ తాటి వెంకటేశ్వర్ల

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 25):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం,జగ్గారం గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన ఆదివాసి గిరిజన బిడ్డ ఊకే శ్రీరామ్,తన తల్లి కష్టంతో సత్తుపల్లిలోని జలగం వెంగళరావు కళాశాలలో బీకాం చదువుతూ గ్రామస్తులు, సర్పంచ్ లు మరియు మండలంలో ప్రజాప్రతినిధుల ఆర్థిక సహాయంతో ఈ నెల 18 తారీకున నేపాల్ దేశం, కాట్మాండ్ రాజధాని, కుక్కర్ పట్నంలో రాక్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాక్ బాల్ ఆటల పోటీలలో 28 దేశాలు పాల్గొనగా మన భారతదేశం తరఫున నలుగురు క్రీడాకారులతో కలిసి *"ఊకే శ్రీరామ్"* కెప్టెన్ గా ముందుండి నడిపించి, మొదటి బహుమతి అయినా గోల్డ్ మెడల్ మరియు కప్పును సాధించడం జరిగింది. వారి విజయాన్ని కాంక్షిస్తూ సత్తుపల్లి నుండి పట్వారి గూడెం వరకు ఆదివాసి గిరిజనుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి తాటి వెంకటేశ్వర్లు,దమ్మపేట మండల జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, దమ్మపేట మండల ఎంపీపీ సోయం ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ దమ్మపేట మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, దమ్మపేట మండల ఎంసీ వైఎస్ చైర్మన్ కొయ్యల అచ్యుత్ రావు,ములకలపల్లి మండల జడ్పీటీసీ సున్నం నాగమణి, ములకలపల్లి మండల ఎంపీపీ మట్ల నాగమణి, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు,ఎటియఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్సం రామారావు, ఆదివాసి గిరిజన నాయకులు బండారు సూర్యనారాయణ ,కొర్సా వెంకటేష్ ,తాటి పోతురాజు , వంకా జానకిరామ్ లు ఘనంగా సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు, ఆదివాసి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, క్రీడాకారులు భారీ ఎత్తున పాల్గొన్నారు .

Share it:

Post A Comment: