CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ జన్మదిన సందర్భంగా సింగరేణి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా,వృక్షరూపాన్ అభియాన్ 2021 కార్యక్రమంలో భాగంగా 5 లక్షల మొక్కలు నాటాలని యాజమాన్యం ఆదేశాల మేరకు మణుగూరు ఏరియ లో 20 వేల మొక్కలను నాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా.కాంతారావు పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం జరిగింది అన్నారు.ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలన్నారు.గ్రీన్ తెలంగాణ నిర్మాణం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య,డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎస్.సి.సి.ఎల్, ఎస్.చంద్ర శేఖర్,సింగరేణి జీఎం జక్కం.రమేష్ కుమార్, ఎస్ ఓ టూ జీఎం లలిత్ కుమార్,సింగరేణి ఉన్నతాధికారులు, టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు వూకంటి.ప్రభాకర్ రావు, టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: