జిల్లా కోవిడ్ సర్వేలైన్స్ అధికారి డాక్టర్ చేతన్
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
మనకు మనము వ్యక్తిగత భద్రత పాటిస్తే ఎలాంటి వైరస్ లు మీ దరి చేరవని జిల్లా కోవిడ్ సర్వైలెన్స్ అధికారి డాక్టర్ చేతన్ అన్నారు. మంగళవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ డేను పురస్కరించుకొని ఆశాలకు ఏఎన్ఎంలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహమ్మారి కరోనా వైరస్ వ్యక్తిగత దూరం పాటించకుండా ఇష్టానుసారం తిరగడం వల్లే కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో బెండాలపాడు గ్రామంలో ఆశాలు ఏఎన్ఎంలు గ్రామంలో పరిస్థితిని సమీక్షించిన సమయంలో కొన్ని విషయాలు తమ దృష్టికి వచ్చాయని గ్రామాల్లో ఎక్కువమంది మాస్కులు ధరించకుండా గుంపులుగుంపులుగా సంచరించడం అలాగే గ్రామాల్లో మహిళలు అందరూ ఒకచోట చేరి ముచ్చట్లు పెట్టుకోవటం అలాగే వివిధ సంఘాల మీటింగులు నిర్వహించడం శుభకార్యాలలో సామాజిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాప్తి చెందిందని వీటన్నిటి అంచనా వేసిన బృందం ఇది కేవలం వ్యక్తిగత భద్రత పాటించకపోవడం వల్లే జరిగిందన్నారు.. గ్రామాల్లో కూడా కొంత మంది ప్రజలు జ్వరం వచ్చిన లక్షణాలు ఉన్న చూపించుకోవడం లేదని తీర చేయి దాటి పోయే సమయానికి పరుగులు పెడితే లాభం లేకుండా పోతుందన్నారు.. ముందుగా గ్రామాల్లో ఎవరికైనా జ్వరం కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు నిర్వహించుకొని తగిన చికిత్స పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని సూచించారు. ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు గ్రామాల్లో ప్రజలను అవగాహన కలిగించి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో హోమియోపతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, స్టాఫ్ నర్సు శంకరమ్మ, పార్మాసి లక్ష్మి, శ్రీనివాసు, కిరణ్, ఆశాలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
Post A Comment: