మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రం ఆకుల వారి ఘనపూర్ కు చెందిన ముదురు కోళ్ల నాగమణికి సీఎం సహాయనిధి నుండి మంజూరైన రూ. 60,000/విలువగల చెక్కును ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు ఆదివారం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అందజేసినారు.అనంతరం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం లోని ప్రజలు బాగుండాలని వారు అనారోగ్యమునకు గురై ఆర్థిక భారంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారి కుటుంబాలు సుఖంగా ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆరోగ్య ఆర్థిక సహాయ నిధి ప్రవేశపెట్టిన గొప్ప దర్శనికుడు గొప్ప ఆదర్శవాది ప్రజ పక్షపాతి అని అలాంటి గొప్ప నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని ఆయన సేవలను సునీల్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సప్పిడి రామ నరసయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా, మండల ఉపాధ్యక్షులు కొమిరి రమేష్, ఎంపీటీసీ సభ్యురాలు కుమ్మరి స్వప్న చంద్రబాబు, ఏటూరు నాగారం మాజీ ఎంపీపీ తూరం పద్మ, మండల మహిళా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సఫియా,చెన్న రాంబాబు,లక్ష్మి పతి,సుజాత రామకృష్ణ,నాగరాజు,నిరంజన్ రెడ్డి,కమలాకర్ రెడ్డి,విష్ణు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: