మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో 300 మందితో జనరల్ బాడీ సమావేశం ను మణుగూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా. కాంతారావు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో యువజన విభాగాన్ని గ్రామ స్థాయిలో బలోపేతం చేసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి. బ్రహ్మయ్య,జడ్పీటీసీ పొశం నర్సింహారావు,పీఏసీఎస్ అధ్యక్షులు కుర్రి. నాగేశ్వరరావు,మండల అధ్యక్షులు ముత్యంబాబు, యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,మరియు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: