CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

##పాముకాటుకు గురై...... మృతి చెందిన బాలిక..... ###

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీలోని బోడ.భాస్కర్ వైఫ్ అఫ్ భారతి దంపతుల గారాలపట్టి బోడ.అఖిలా(8సం'') 24/07/2021 రాత్రి 10:00గంటల టైంలో చిన్నారి ను పాము కాటువేసినది.ఏమి పామో తెలియదుగాని చిన్నారి కేకలు వెయ్యడంతో తల్లిదండ్రులు హఠ:త్తుగా నిద్రలేచి చూడగా ఏమైనదో తెలియదు.ఏమి  అర్ధంకావడంలేదు,పాల్వంచ తీసుకెళ్లడానికి ఆటో కోసం చూసినారు, ఈ టైం లో ఆటో లు దొరకలేదు, గతంలో ఈ ఉమ్మడి పంచాయతీ పరిధిలో ప్రైమరీ హెల్త్ సెంటర్(పి.హె.సి ) 24గంటలు ఉండేది, ఉంటే పాప బ్రతికేదేమో, ఈ 24గంటల అత్యవసర సేవలు లేకపోవడం వాళ్ళ ఇక్కడ ఉన్నా ఏజెన్సీ ప్రజలు చాలా ఇబ్బందులకు గురైతున్నారు.పాల్వంచ నుండి ఉల్వనూరు వరకు రోడ్డు రవాణా వ్యవస్థ చాలా అద్వానంగా ఉన్నడం వల్ల పేసెంట్లూను సరైన టైం లో హాస్పిటల్ కు తీసుకెళ్లలేకపోతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబానికి ఇదే పరిస్థితి వెదురు వచ్చినది. సకాలంలో హాస్పిటల్ కు వెళ్లలేక తమ కూతురి ప్రాణాలు  కోల్పోయినం అని వారి కుటుంబ సభ్యులు వేడుస్తూ తమ బాధను వ్యక్తపరిచినారు.

Share it:

Post A Comment: