మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం...
తెలంగాణ రాష్ట్ర సాధన లో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు స్వరాష్ట్రంలో అడుగడుగునా అవమానాలు కలుగుతున్నాయని బూర్గంపాడు మండల జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. 18-7-2021న హుజూర్ నగర్ లో ఏర్పాటుచేసిన ప్రజా సమస్యల చర్చా వేదిక వద్ద కొందరు దుండగులు జర్నలిస్టులపై జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు పాలకులకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ పని చేస్తూ సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులను అవమానించడం మరియు వారిపై భౌతిక దాడులకు దిగడం అప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తున్నా అని అన్నారు. రాజ్ న్యూస్ పై జరిగిన దాడిని ఖండిస్తూ తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసి స్థానిక తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో యన్ టీవీ తాళ్లూరి శ్రీ హరి, వి6 ప్రవీణ్, రాజ్ న్యూస్ వెంకట్రాంరెడ్డి, హెచ్ యం.టీవీ ఆవుల వెంకట రెడ్డి,999 టీవీ పేరాల శ్రీనివాసరావు, సామ న్యూస్ వేల్పుల మనోజ్ కుమార్, AB న్యూస్ రాజా పాల్గొన్నారు.
Post A Comment: