మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో అధ్యక్షులు గోడిశాల రామనాధం మాట్లాడుతూ, 2నెలల నుండి వృద్దులకు, వికలాంగులకు రావాల్సిన పింఛన్లు రావటం లేదని, పేద ప్రజలకు రేషన్ కార్డులు లేవని,ప్రభుత్వం పెట్టే పథకాలు పేపర్లల్లో చదువుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయని, ప్రజా ప్రతినిధులు మాత్రం ప్రతి నెల కచ్చితంగా లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటున్నారని, పేదవాడికి పింఛన్ ఇవ్వలేని ప్రభుత్వం ఉన్నాఒక్కటే, లేకపోయినా ఒక్కటే అని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో, పేపర్ గవర్నమెంట్ నడుస్తుంది అని, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పింఛన్లు, రేషన్ కార్డులు ప్రజలకు అందించాలని ఆయన డిమాండ్ చేసారు. వృద్దులకు పింఛన్ ఇవ్వలేని కేసిఆర్ ఒక్కో దళితుల కుటుంబానికి పదిలక్షలు ఇస్తా అని చెప్పటం చూస్తుంటే అది హుజురాబాద్ ఎన్నికల స్టంట్ లానే కనపడుతుందని , బండారం మొత్తం ప్రజలకు అర్ధమైందని నీకు ప్రజలు 2023ఎన్నికల్లో బుద్ధి చెప్పడం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోడ రమేష్, మండల నాయకులు మునిగల వెంకటేశ్వర్లు, కొంబత్తిని శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: