-యువజన కాంగ్రెస్ ములుగు జిల్లా నాయకులు కర్రీ నాగేంద్రబాబు.
మన్యం టీవీ మంగపేట.
అర్హులైన నిరుపేదలు అందరికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని యువజన కాంగ్రెస్ ములుగు జిల్లా నాయకులు కర్రీ నాగేంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరై మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వారికే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ ఒక్కరి కి రేషన్ కార్డులు రాక పాత దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరు చేయక పోవటంతో కొత్తగా వివిధ రూపాలలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చాలా మంది నూతనంగా వివాహమైన వారు,పిల్లలు కలిగిన వారి పేర్లను రేషన్ కార్డులో నమోదు చేసుకోవటం కొరకు చాలా మంది పేద ప్రజలు రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు లబ్ధిదారుల అప్లికేషన్లను పూర్తి స్థాయిలో సంబంధింత అధికారులు విచారణ చేసి వాటిని జిల్లా పౌర సరఫరాల శాఖ(డి,ఎస్,ఓ)లో అప్లోడ్ అయినాయని దరఖాస్తు చేసుకొని చాలా సంవత్సరాలు దాటినప్పటికి అనుమతులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి రేషన్ కార్డులు మంజూరు చేసే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని లబ్ధిదారులు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్న విచారణ జరిపి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని,పాత దరఖాస్తుదారులకే కాక,కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి నిరుపేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే కొత్త దరఖాస్తులకు కూడ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు..
Post A Comment: