(పోతమ్మను శాలువాతో సత్కరించిన భారతీయ జనతాపార్టీ నాయకులు)
అన్నపురెడ్డిపల్లి,మన్యం మీడియా ప్రతినిధి:; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండలం, భీమునిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మడకం పోతమ్మ ను ఐసిఏఆర్ సభ్యులు,సెంట్రల్ టొబాకో కమిటీ మెంబర్-బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రామ పంచాయతీలోని ప్రజలను,కోవిడ్ మహమ్మారి నుండి కాపాడే దిశలో భాగంగా, స్వయంగా గ్రామ రహదారిపై చెక్ పోస్టు ఏర్పాటు చేసి, పెట్రోలింగ్ నిర్వహించడం.గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో, పారిశుద్ధ్య కార్యక్రమాలను చూపించడం. తదితర వివరాలను గుర్తించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.వారి వెబ్సైట్లో వివరాలను పొందుపరచడంతో పాటు, స్వయంగా ప్రశంసించారు.ఈ సమాచారం తెలుసుకున్న బిజెపి నాయకులు శనివారం నాడు ఆమెను సత్కరించి, కేంద్ర ప్రభుత్వ ప్రశంస పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా (కోవిడ్-19) మహమ్మారి నుండి గ్రామ పంచాయతీ ప్రజలను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ప్రజలకు కోవిడ్ సూచనలు అందించడంతో పాటు, అనునిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి, ఎక్కువమంది ప్రజలు కరోనా బారిన పడకుండా కాపాడేరున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి-యడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి-భూక్య రవి నాయక్, దళిత మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు-కటికాల రంజిత్, ఎన్. శ్రీనివాస్, బిజెపి పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల ప్రధాన కార్యదర్శి- ఈడూరి దేవి బాల కిరణ్, ఉపాధ్యక్షులు-జఠంగి కృష్ణ, మండల నాయకులు- వడ్లనపు సతీష్ , మడకం వెంకటేశ్వర్లు , తదితరులునాయకులు పాల్గొన్నారు.
Post A Comment: