మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలో కరోనా సోకిన నిరుపేదలైనా ఇరవై కుటుంబాలకు కమలాపురం ప్రభుత్వ పాటశాలలో ఎటూరునాగారం సి.ఐ సట్ల కిరణ్ కుమార్ గారు చేతుల మీదుగా నిత్యవసర సరుకుల పంపినీ జరిగింది.
సీఐ కిరణ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లడుతూ కరోనా భాదిత కుటుంబాలకు సహకరించడానికి భందువులు,ఆత్మీయులు ముందుకు రాని పరిస్తితులలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపినీ చేయటం అబినందించే విషయమని, ఈ కార్యక్రమంలో తనను కూడా భాగస్వామ్యున్ని చేయడం సంతోషంగా వుందని,పోలీసు శాఖ నుండి ధర్మజాగణ సమితి సేవా కార్యక్రమాలకు అన్ని విధాల సహకరిస్తామని వారు అన్నారు. ఏటూరునాగారం ఖండ కార్యవాహా ఇప్పలపెళ్ళి రమేష్ మాట్లడుతూ మండలంలోని కమలాపురం,బోర్ నర్సాపురం,రాజుపేట,
నిమ్మగుడేం మరియు రమనక్కపేట గ్రామాలలోని కరోనా పాజిటివ్ వచ్చిన నిరుపేద కుటుంబాలను నిత్యవసర సరుకులు అదించామని ఇరవైఅయిదు కిలోల బ్రౌన్ రైస్,చక్కర 1కేజీ పప్పు 2కేజీ ఆయిల్ 1కేజీ ,గోధుమ పిండి2కేజీ , ఉప్పు 1కేజీ
ఉల్లిగడ్డ 1కేజీ ,అలుగడ్డ1కేజీ మరియు కారం,పసుపు లను కరోనా భాదిత కుటుంబాలకు ఇచ్చినట్టు రమేష్ తెలిపారు,ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ధర్మజాగారణ సమితి ప్రశాశనిక్ ప్రముఖ్ కుదురుపాక ప్రవీన్, ధర్మజాగరణ సమితి అంశాకాలిన కార్యకర్త రావుల కేశవరావు, ధర్మజాగరణ కార్యకర్తలు నందిగాం కృష్ణ స్వామి ,కొల్లి పూర్ణ చందర్ రావు మరియు వజనపెళ్ళి రమేష్ తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: