CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కనీస వేతనాల జీవో ప్రకారం

Share it:

 


 19 వేల రూపాయలు వర్తింప చేయాలి

మన్యం టీవీ, భద్రాచలం టౌన్:

భద్రాచలం గ్రామ పంచాయతీ నందు సుమారుగా 200 మంది వివిధ విభాగాలలో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. వారికి నూతనంగా ప్రకటించిన పిఆర్సి 30 శాతం అమలు చేయాలని కనీస వేతనాలు జీవో ప్రకారం పంతొమ్మిది వేల రూపాయలు వర్తింప చేయాలని కోరుతూ సిఐటియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రోజు ఈవో వినతి పత్రం ఇవ్వడం జరిగినది .అనంతరం జరిగిన సభనుద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి Ajరమేష్ , యూనియన్ సెక్రటరీ ఏబీ నర్సారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ గా ఉన్నదని గతంలో మున్సిపాలిటీగా టౌన్షిప్ పరిపాలన కొనసాగినది అప్పుడు కార్మికులకు మున్సిపల్ వేతనాలు అమలు అయ్యాయని కానీ నేడు భద్రాచలం పంచాయతీ అన్ని పనులు మునిసిపాలిటీ పద్ధతిలో అమలు చేస్తు వేతనాలు మాత్రం గ్రామ పంచాయతీ జీవో ప్రకారం చెల్లిస్తున్నారు ఇది చాలా అన్యాయం అని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి 30శాతం కాంట్రాక్టు ఉద్యోగులకు కార్మికులకు అంగన్వాడీలకు పంచాయతీ సెక్రటరీలకు ప్రజాప్రతినిధులు జడ్పిటిసి సర్పంచ్లు ఎంపీటీసీలు అందరికీ పెంచుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది కానీ గ్రామపంచాయతీ కార్మికులు గాని మున్సిపల్ కార్మికులు గాని పెంచకపోవడం చాలా అన్యాయమని అన్నారు. కష్టకాలంలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం చాలా అన్యాయమని కావున వెంటనే వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంయూనియన్ అధ్యక్షులు కాపుల రవి అధ్యక్షతన జరిగింది .ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యూనియన్ కార్యదర్శి ఎంబినర్సారెడ్డి ,బండారుశరత్ 

బాబు, నాగరాజు ,యూనియన్ నాయకులు జక్కుల కృష్ణార్జున రావు, జంగిలినాగేశ్వరావు, ప్రేమ్, శ్రీను ,ఆది నారాయణ ,కత్తి శీను, అనసూయ ,విజయ భాను, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: