మన్యం టీవీ : ఇల్లందు
స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకూడదనే సంకల్పంతో పట్టణంలోని ప్రజా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్వహించాలని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ తెలిపారు. డిఎంఎఫ్ నుంచి రూపాయలు 11.60 లక్షలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పాత బస్టాండ్ లో, కొత్త బస్టాండ్ లో నిర్మించిన ప్రజా మూత్రశాల మరియు మరుగుదొడ్లును ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జాని పాష, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు అజాన్, నాగేశ్వరరావు, నవీన్, పద్మావతి, జెకే శ్రీను, శారద తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: