మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో ఉన్న సమితి సింగారం పంచాయతీ లోని అశోక్ నగర్ ఆరోగ్య ఉప కేంద్రం నందు సోమవారం మణుగూరు ఎంపీపీ కారం విజయ కుమారి దోమతెరల పంపిణీ చేయడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు పరిధి లో మొత్తం 19 గ్రామాలకు 9651 దోమతెరలు రావడం జరిగింది అని తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీపీ కారం విజయ కుమారి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సీజనల్ వ్యాధులు అయిన టైఫాయిడ్ మలేరియా, డెంగీ,చికున్ గున్య,జ్వరాలు రాకుండా కాపాడుతుంది అన్నారు.కావున ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని కోరారు. పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చేసుకోవలన్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తు, విధిగా మాస్క్ ధరించాలి అని,భౌతిక దూరం పాటించాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సమితిసింగరం సర్పంచ్ బచ్చల భారతి,ఎంపీఓ వెంకటేశ్వర రావు,డాక్టర్. మౌనిక,సిహెచ్ఓ వెంకటేశ్వర రావు,ఎస్ యూ ఓ లింగయ్య నాయక్,సూపర్ వైజర్ స్వర్ణ లత,ధన లక్ష్మి,రాంప్రసాద్,ఉమేష్, యశోద,సుమా,వార్డ్ మెంబెర్స్,ఆశా కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: