అంత్యక్రియలు నిర్వహించిన నాగుల్ మీరా బృందం...
మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీ శివారు కాల్యా తండా నివాసి మాలోత్ బద్రు (45) ఖమ్మంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు కరోనా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించవలసిందిగా నాగుల్ మీరా బృందాన్ని కోరగా వెంటనే స్పందించిన నాగుల్ మీరా తన మిత్ర బృందంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు, లేళ్ళ గోపాల్ రెడ్డి, పాల్గొన్నారు.
Post A Comment: