మన్యం టీవీ కొత్తగూడెం:-
తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని ప్రొఫెసర్ జయశంకర్ సార్ పదకొండవ వర్థంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు .
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, వారి ఆలోచనలకు అనుగుణంగానే సీఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం లో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ట్రాల తో అభివృద్ది లో తెలంగాణ పోటీ పడుతూ తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతుంది అని కాపుసీతాలక్ష్మి అన్నారు. నివాళులర్పించిన వారిలో టీబీజీకేఎస్ లెవెన్ మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ , సెంట్రల్ కమిటీ సభ్యులు సూరిబాబు , టిఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, అన్వర్ , రాజు, శీను , నవీన్ ,లక్ష్మీ , శిరీష తదితరులు ఉన్నారు.
Post A Comment: