మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బాణోత్ నగేష్ (23 సం) అనే యువకుడు ఊరు శివారు పొలంలో ఉన్న బావిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం ఉదయాన్నే పొలంలో ఉన్న బావిలో నగేష్ పడి ఉండడాన్ని చూసిన గ్రామస్తులు కుటుంబసభ్యుల కు సమాచారం ఇవ్వగా వెళ్లి గమనించగా చనిపోయి ఉన్నాడు. దీనితో ఒక్కసారిగా రోదిస్తూ కుప్పకూలిపోగా చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకుని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోడని,మా కొడుకుతో గత మూడు రోజుల క్రితం ఇద్దరు యువకులు గొడవ పడ్డారని వారిపై అనుమానం వ్యక్తం చేశారు, వాళ్లు ఇద్దరే చంపేసి పడేశారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి కేసు నమోదు దర్యాప్తు చేశారు.
Post A Comment: