మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మణుగూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అధ్యక్షులు కుర్రి.నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత స్వరాష్ట్రంలో పేద,బడుగు బలహీన వర్గాల వారు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న,సన్నకారు రైతుల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు.సొసైటీల ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు అందిస్తున్నామన్నారు. సంక్షేమంలో లో దేశాలు కే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ముందుంది అన్నారు.ఉద్యమ నేత సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో లో జడ్పీటీసీ పొశం.నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,సొసైటీ వైస్ చైర్మన్ దొండేటి రామోహన్ రావు,సీఈఓ జ్ఞానదాసు, సొసైటీ డైరెక్టర్ ఉడతాని. రవి,ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల శీను,ముద్దంగుల కృష్ణ, వెంకటరెడ్డి,హరిప్రసాద్, తంత్రపల్లి కృష్ణ,తాత రమణ,సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్ యువజన నాయకులు తాళ్లపల్లి.రాహుల్, జి రాఘవులు,శివ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: