👉 మన్యం టీవీ దృష్టి కి తీసుకవచ్చిన భాదితులు
మన్యం టీవీ పాల్వంచ:-
పాల్వంచ గవర్నమెంట్ హాస్పిటల్ నందు అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన రాంబాబు చెప్పిన వివరాల ప్రకారం తన భార్య మంగ ను డెలివరీ నిమిత్తం హాస్పిటల్ కి తీసుకు వచ్చారు. డెలివరీ అయిన తర్వాత డాక్టర్ల పేరు చెప్పి సిబ్బంది 1000 రూపాయలు తీసుకున్నారని నర్సుల పేరుచెప్పి 500 తీసుకున్నారని ఇక్కడ హాస్పిటల్లో ప్రతి పనికి కూడా డబ్బులు అడుగుతున్నారని ఇవ్వని వారిపై కక్ష సాధింపు చర్యగా ప్రవర్తిస్తున్నారని కనీసం మంచి నీటి వసతి కూడా శుభ్రమైన విధంగా హాస్పిటల్ వారు కల్పించలేదని అన్నారు. *భోజనం నిమిత్తం కూడా ఎవరైనా ఉచితంగా ఇస్తారేమో అని ఎదురు చూసే పరిస్థితులలో ఉన్న మాలాంటి వాళ్ల దగ్గర డబ్బులు అడుగుతున్నారని వాపోతున్న బాధితుడు*. క్లీనింగ్ సిబ్బంది దగ్గరనుంచి డాక్టర్ ల వరకు డబ్బులు దండుకోవడం పై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి సమస్య నా ఒక్కడిదే కాదు హాస్పిటల్ కి ట్రీట్మెంట్ నిమిత్తం వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
Post A Comment: