CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా పర్మినెంట్ చేయండి ఎమ్మెల్యేకు అవుట్ సోర్సింగ్ డాక్టర్లు వినతి.

Share it:

 


•మాకు ఏమైనా జరిగితే మా కుటుంబలకు భద్రత ఏది..?


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టర్ వైద్యులు మైన  తమను రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా పర్మినెంట్ చేయాలని  అశ్వారావుపేట  ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కు కాంట్రాక్టు డాక్టర్లు వినతి పత్రం అందజేశారు. శనివారం చండ్రుగొండ  మండలం లో పర్యటిస్తున్న  ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ను అవుట్ సోర్సింగ్ డాక్టర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్ సోర్సింగ్ వైద్యులుగా పని చేస్తున్నామని. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందేలా ఈ ట్రైబల్ జిల్లాలో ఎన్నో మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసి అలాగే పేద ప్రజలందరికీ ప్రభుత్వ వైద్య సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నాము.అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్లి  ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడే వారికి వైద్య సేవలు అందిస్తున్నామని  ఈ కరోనా కష్టకాలంలో కూడా గత సంవత్సరం కాలం నుండి మా ప్రాణాలను సైతం తెగించి మా కుటుంబసభ్యులు ప్రాణాలు కూడా రిస్క్ లో పెట్టి ఎక్కడా కూడా అధైర్యపడకుండా ముందుండి మా సేవలు కొనసాగిస్తున్నామని  ఒకవేళ సేవలందించే సమయంలో జరగరానిది ఏదైనా జరిగితే మా కుటుంబాలను పట్టించుకునే వారు కూడా ఉండరని అన్నారు. డాక్టర్ నరేష్  విషయంలో ఎమ్మెల్యేగా వారు అందించిన కృషి వల్ల వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చేసినందుకు మేమందరం ఎంతో సంతోషించాము అన్నారు. అదే ఒక కాంట్రాక్ట్ వైద్యునికి ప్రమాదం జరిగి ఉంటే ఏ విధమైన ప్రోత్సహకాలు వర్తించవని ఆవేదన వ్యక్తం చేశారు. మేమందరం కూడా ఇదే జిల్లాలో పుట్టి ఇదే జిల్లాలో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ఏవిధంగా అయితే రిక్రూట్మెంట్ చేశారో అదేవిధంగా మా అందరిని కూడా సర్వీస్ పాయింట్ కేటాయించి రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా పర్మినెంట్ చేయాలని  ఇక ముందు కూడా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని ఎమ్మెల్యేని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గీత, ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు..

Share it:

TELANGANA

Post A Comment: