అద్భుతమైన ఫలితాలు* *సాధించిన మంగపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు:
మన్యం టీవీ మంగపేట.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో మంగపేట మండల కేంద్రంలోని ఎక్కటి సరోజనీ శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతతో, అద్భుతమైన ఫలితాలు సాధించారు. *రచన బైపీసీ లో* *1000 మార్కులకు గాను* *900 సాధించి కళాశాల* *టాపర్ గా* *నిలిచింది* . చందన ఎంపీసీ లో 892/1000 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో, బైపీసీ లో పల్లపు రమాదేవి 876/1000 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. ,సమ్రత బైపీసీ లో 874/1000, శ్రావ్య బైపీసీ లో 874/1000, షేక్ సమీరా బైపీసీ లో 828/1000, సంతోష్ ఎంపీసీ లో 820, సురేందర్ ఎంపీసీ లో 812, నందిని సీఇ సీ లో 812, శ్రీనివాస్ ఎంపీసీ లో 808, గౌసోద్దీన్ ఎంపీసీ లో 804 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఉన్నత ఫలితాలు సాధించిన మా విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రిన్సిపాల్ నిరంతర పర్యవేక్షణ, అధ్యాపక బృందం నాణ్యమైన బోధన, విద్యార్థులు అంకితభావంతో చదవడం వల్లనే ఈ ఫలితాలు సాధించినాము.
ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య,అధ్యాపక బృందం రేణుకాదేవి, జ్యోతిర్మయి, సంతోషకుమార్, శైలేందర్, లక్ష్మణ్, సతీష్ కుమార్, అశోక్, అనిల్, శ్యామ్, చిరంజీవి, నరేష్ హర్షం వ్యక్తం చేశారు.
Post A Comment: