మండల ప్రజా ప్రతినిధులు
గుండాల (మన్యం టీవీ)ప్రోటోకాల్ పాటించని తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని గుండాల ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సర్పంచ్ కోరం సీతారాములు మాట్లాడుతూ సోమవారం తాసిల్దార్ కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారని పంపిణీ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులతో చెక్కుల పంపిణీ చేపట్టడం ఏమిటని అన్నారు . తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముత్యమా చారి , గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని , సర్పంచ్ సమ్మయ్య , రోడ్ల గడ్డ సర్పంచ్ అజ్మీర మోహన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: