మన్యం టీవీ కొత్తగూడెం:-
గురువారం నాడు
విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ సిఐ పుల్లయ్య తన సిబ్బందితో కలిసి 10 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇల్లందు మండలం మర్రిగూడెం తండాకు చెందిన బానోతు దేవీలాల్ అనే వ్యక్తి వద్ద నుండి ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ పుల్లయ్య వెల్లడించారు.పేద ప్రజలకు చెందాల్సిన ఈ పిడిఎస్ రైస్ ను అక్రమంగా నిల్వ ఉంచిన నిందితుడిని ఇల్లందు పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. అనంతరం నిందితుడు దేవీలాల్ పై కేసు నమోదు చేసినట్లు ఇల్లందు సిఐ రమేష్ వివరించారు.
Post A Comment: