తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాజ్భవన్లో 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్తో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్. కొవిడ్ నిబంధనల దృష్ట్యా నిరాడంబంరంగా ఈ కార్యక్రమం జరిగింది. స్టాలిన్తో పాటు 33 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. జలవనరుల శాఖ మంత్రిగా దురైమురుగన్ ప్రమాణం చేశారు. స్టాలిన్ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనార్టీలకు స్థానం దక్కింది.
Navigation
Post A Comment: