హైదరాబాద్ : రాష్ట్రంలో వృద్ధ కళాకారుల నెలవారీ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. వృద్ధ కళాకారులకు గౌరవప్రదంగా నెలకు ఇస్తున్న రూ. 1500 మొత్తాన్ని రూ. 3016లకు పెంచుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి పింఛన్ పెంపును వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. వృద్ధ కళాకారులకు పింఛన్ పెంపును అమలు చేసిన సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 2,661 మంది కళాకారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.
Navigation
Post A Comment: