CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక పాసుల జారీ.

Share it:


మన్యం టీవీ కొత్తగూడెం:-

రాష్ట్రంలో ఈ రోజు నుండి పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో  వేరే రాష్ట్రాలకూ మరియు ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ- పాస్ లకు గాను *https://policeportal.tspolice.gov.in/* అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులను జారీచేస్తామని తెలిపారు.ఇతర రాష్ట్రాలకు,రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లొనే పాసులు జారీ చేయడం జరుగుతుంది.ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన పాస్ లను కలిగి ఉంటేనే వారిని అనుమతించడం జరుగుతుంది.


          లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం ఆరు గంటలనుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదు. రాష్ట్రంలోని ఎక్కడినుండైనా పేర్కొన్నవెబ్ సైట్ ద్వారానే ఈ-పాస్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ నేడు తెలియజేశారు

Share it:

TELANGANA

Post A Comment: